Monday 14 September 2015

తిరుమలలో బ్రహ్మోత్సవాలు: ఆర్జిత సేవల రద్దు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో సాంబశివరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీ దర్శనాలు కూడా తగ్గించామన్నారు. వాహన సేవ చూసేందుకు వచ్చే భక్తుల కోసం నాలుగు మాఢ వీధుల్లో గ్యాలరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. గరుడ సేవ నాడు భక్తుల కోసం తిరుమలలో 512 ఆర్టీసీ బస్సులతో 3, 500 ట్రిప్పులు తిప్పుతామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునేలా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తిరుమలలో23, తిరుపతిలో 4 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు మొదటిరోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సాంబశివరావు తెలిపారు.